Description
About :
సంఖ్యాపరంగా నేడు ప్రపంచవ్యాప్తంగా చెలామణిలో ఉన్న మతం క్రైస్తవం. యావత్ క్రైస్తవానికి మూలాధారమైన గ్రంథం బైబిల్. బైబిల్ ఆధారంగా క్రైస్తవాన్ని అర్ధం చేసుకోవడంలో కొత్త కోణాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. పాత నిబంధన, కొత్త నిబంధన అంటూ రెండు భాగాలుగా ఉన్న బైబిల్ మొదటి భాగమైన పాత నిబంధనలో క్రైస్తవులు దేవునిగా భావించే యెహోవా పాత్ర గురించి మనకు వివరిస్తుంది. బైబిల్ దేవుడైన యెహోవా లక్షణాలు, అతడు ఇచ్చే ఆదేశాలు, పలు సందర్భాల్లో మానవాళిపై వ్యక్తం చేసే ఆగ్రహావేశాలు, పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు మొదలైన అంశాలని ఈ పుస్తకం మనకు తెలియజేస్తుంది. అదే విధంగా క్రైస్తవులు దేవుని కుమారుడిగా, తమ రక్షకుడిగా భావించే యేసు పుట్టుక నుంచి మరణం వరకు వివరించే కొత్త నిబంధనలో, చారిత్రక ఆధారాలు లేని అనేక అంశాలను ఈ పుస్తకం స్పృశిస్తుంది.
చర్చ్ వ్యవస్థ, అందులోని అధికార క్రమం, వారి విధులు, వివిధ క్రైస్తవ శాఖలు, వాటి విశ్వాసాలు,ఆ శాఖల ఆవిర్భావానికి దారితీసిన ఘటనలు, పోప్ స్థాయిలో చోటుచేసుకున్న వివాదాల గురించి కూడా ఈ పుస్తకం తెలియజేస్తుంది. క్రైస్తవం ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనూ, ఒకే సిద్ధాంతం కాదు. రోమన్ కాథలిక్ చర్చ్ తో పాటు, ఆర్థోడాక్స్, లూథరన్, ప్రేస్బిటేరియన్, ఆంగ్లికన్, బాప్టిస్ట్, మెథడిస్ట్, అడ్వెంటిస్ట్, పెoటెకోస్టల్ వంటి ప్రొటెస్టెంట్ చర్చ్ లు ఉన్నాయి. వీటి సిద్ధాంతాలు, చరిత్ర, నిర్మాణం, విధానాలు, వాటి వ్యాప్తి, వాటి సంఖ్య ఈ పుస్తకం వివరిస్తుంది.
ఈ పుస్తకం విద్యావేత్తలు, విశ్వవిద్యాలయాలు, మేధావులు `క్రైస్తవం’ అధ్యయనం చేసేందుకు ఎంతో ఉపయోగపడుతుంది.
This is a Telugu translation of the book : Isayiyat : Sidhant evam Swarup
Samvit Prakashan ; Pages ; 248 ; Paperback ;

For Bulk Bookings contact +91 85209 99562
Reviews
There are no reviews yet.