| | టర్కీలోని ఖలీఫా పదవిని పునరుద్ధరించాలంటూ సాగిన ఆందోళనే ఖిలాఫత్ ఉద్యమం. ప్రపంచంలోని మరే ముస్లిం దేశంగాని, ముస్లింగాని ఈ ఉద్యమంలో పాల్గొనలేదు. భారత్ తో కానీ, భారత్ లో అప్పట్లో సాగుతున్న స్వాతంత్ర్య ఉద్యమంతోకానీ ఏమాత్రం సంబంధంలేని ఈ ఉద్యమానికి మద్దతునివ్వాల్సిందేనంటూ గాంధీజీ కాంగ్రెస్ ను ఒప్పించారు. హిందూ, ముస్లిం ఐక్యత సాధిస్తే బ్రిటిష్ పాలనను అంతంచేయవచ్చన్న ఆయన అంచనాలు తల్లక్రిందులై చివరికి ముస్లిం వేర్పాటువాదం దేశ విభజనకు దారితీసింది. | |||||
| | శివాజీ జీవిత లక్ష్యం ఏమిటి? యవనుల నాశనమే తన జీవితాశయమని ఆయన ఎందుకన్నారు? యవనులు చేసిన దారుణాలు ఏమిటి? ఆ దారుణాలు చేయడానికి కారణమైన వారి మతసూత్రాలు ఏమిటి? ఇస్లామిక్ రాజ్యపు స్వభావం ఏమిటి? శివాజీ స్థాపించిన హైందవీ సామ్రాజ్య లక్షణాలు ఏమిటి? ఈ విషయాలను సంక్షిప్తంగా, క్లుప్తంగా వివరించే శ్రీ గజానన్ భాస్కర్ మహందలే రచన `Chatrapati Shivaji : Saviour of Hindu India’ కు తెలుగు అనువాదం `హిందూ జన రక్షకుడు ఛత్రపతి శివాజీ’ తప్పక చదవండి.
| |||||
| | అనాదిగా మనదేశంలో విద్యావ్యవస్థ పరిపాలన వ్యవస్థ నియంత్రణకు గురి కాలేదు! విద్యావిధానం సర్వస్వతంత్ర వ్యవస్థగా కొనసాగింది! బ్రిటన్ విముక్త భారత్లో ఈ విధానం పునురుద్ధరణకు నోచుకొని ఉండాలి! న్యాయవ్యవస్థ వలె విద్యావ్యవస్థ ఉండాలన్నది ఆకాంక్ష! రాజ్యాంగ వ్యవస్థలో ప్రస్తుతం కార్య నిర్వాహక (మంత్రివర్గం) విభాగం, శాసననిర్మాణ విభాగం (చట్టసభలు) న్యాయవిభాగం (న్యాయస్థానాలు) ఉన్నాయి. రాజ్యాంగ వ్యవస్థలో నాలుగవ స్వతంత్ర విభాగంగా విద్యావిభాగం ఏర్పడాలి. 2020 జూలై 29వ తేదీ నాడు కేంద్రప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానాన్ని ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో ఈ రచన జరిగింది.
| |||||
| | ముందు మాట : శ్రీ బండి సంజయ్ కుమార్ , ఎం. పి హోం వ్యవహారాల సహాయ మంత్రి, భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న హిందువులపై జిహాదీ ముసుగులో రాక్షస మూకలు జరుపుతున్న అరాచకాలను చూసి యావత్ ప్రపంచం నివ్వెరపోతోంది. ఇప్పుడంటే ఇంటర్నెట్, మీడియా ప్రసార మాద్యమాలు అందుబాటులో ఉన్నందున ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నాం. కానీ ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళితే… బంగ్లాదేశ్ ఆవిర్భావ సమయంలో, ఆ తరువాత హిందువుల మీద జరిగిన అకృత్యాలు, దారుణ మారణకాండను తలుచుకుంటే నేటికీ ఒళ్లు జలదరిస్తోంది. కానీ మీడియా, ప్రసార మాద్యమాలు, సోషల్ మీడియా అందుబాటులో లేకపోవడంతో ఇవేవీ ప్రజలకు పెద్దగా తెలియకుండా పోయాయి. ఆ దారుణ మారణకాండ కాలంలో కొన్ని లక్షలమంది హిందువులు జిహాదీ శక్తుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. వేలమంది హిందూ ఆడపడచరులు లైంగిక దాడులకు గురయ్యారు. లక్షల మంది హిందువులు ఇల్లు, ఆస్తిపాస్తులను వదిలేసి కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భారతదేశం వలస వచ్చి వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఆ శరణార్థులలో ఎంతోమంది కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. ఇంకా లోతుల్లోకి వెళితే….1947లో దేశ విభజన సమయంలో తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్) మొత్తం జనాభాలో హిందువులు 31 శాతంగా ఉండేవారు. కానీ నేడు అదే బంగ్లాదేశ్ లో హిందువుల జనాభా 3 శాతానికి పడిపోయింది. కానీ భారత్ విషయానికొస్తే… 1951లో 84 శాతమున్న హిందూ జనాభా 2011 జనాభా గణంకాల ప్రకారం 79 శాతానికి పరిమితమైంది. అదే సమయంలో 1951లో 9 శాతమున్న ముస్లిం జనాభా ప్రస్తుతం 15 శాతం దాటింది. దీనిని బట్టి పరిస్థితి ఎట్లుందో అర్ధం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్ లో హిందువులపై ఎలాంటి దారుణకాండ జరుగుతుందో తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. నాటి విషాద ఘట్టాలను, వాస్తవాలను మన జాతి మరిచిపోతే చరిత్ర పునరావృతం అయే అవకాశం ఉంటుంది. హిందువుల మనుగడే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదముంది. వారి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఈరోజు మనకు ఉంది. శరణార్థుల దారుణ అనుభవాలను లిఖిత రూపంలో ‘బంగ్లా హిందువుల అజ్ఞాత మారణకాండ’ పేరుతో పుస్తక రూపంలో సంవిత్ ప్రకాశన్ వారు ప్రచురించి మన ముందుకు తీసుకురావడం ఎంతో అభినందనీయం. రచయితతోపాటు ఈ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు అహర్నిశలు క్రుషి చేసిన వారందరికీ నా హ్రుదయపూర్వక శుభాకాంక్షలు. భారత మాతాకీ జై…..
| |||||
| | The aim of this compilation is not to argue for a go-back to the olden days which is not practicable not is it a plea against English language as such. It is an appeal to get informed about the nefarious designs of the introducer of English education in our country, and work hard to remove its deleterious effects and place it on a firm indigenous footing. Buy at Hindu eShop Buy at Amazon
| |||||
| | This book is an attempt to provide an overview of the aggression on Hindus in Bengal for the last eight decades. Amply referenced, it also throws light on political positioning and intellectual shenanigans that have facilitated the aggression. Recent events in Bengal, reports of post-poll violence, arson and loot, with thousands fleeing their homes to the security of neighbouring states, have disturbed many. Bengal is bleeding.
| |||||
| | గుడి అంటే ఏమిటి? మంటపం, ముఖద్వారం, గర్భగృహం, దేవుడు, ధ్వజస్తంభం …. గుడి అంటే ఇదేనా…?
| |||||
| | This book delves into roots of the struggle between traditional Bharat and the State which modelled itself on the Anglo Saxon model even after Independence. In this book, Shri S. Gurumurthy deals with the subject of Traditional India and Constitutionalism thoroughly with deep philosophical, societal and political insight.
Buy at Hindu eShop Buy at Amazon Kindle Edition
| |||||
| | స్వాతంత్ర్యాన్ని స్వరాజ్యంగా మలచడంలో కూడా సంఘం కీలక పాత్ర పోషించింది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో దేశం ఎదుర్కొన్న బాలారిష్టాలను, సమస్యలను తీర్చడంలో వేలాది సంఘ స్వయంసేవకులు అపూర్వమైన ధైర్యసాహసాలు, త్యాగాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా రక్తసిక్తమైన దేశ విభజన సమయంలో ముస్లింలీగ్ ముష్కర మూకల నుండి సిక్కులు, హిందువులను కాపాడి సురక్షితంగా భారత్ కు చేర్చడంలో స్వయంసేవకులు చూపిన తెగువ, దేశభక్తి అమోఘం.
| |||||
| | ఆఖరు ప్రవక్తగా ముస్లింలు చెప్పే మహమ్మద్ ప్రవక్త జీవితమే ఇస్లాంకు ఆధారం. ప్రవక్త ఏం చెప్పారో, ఏం చేశారో అదే తమకు ఆచరణీయం, అనుసరణీయని ముస్లింలు పదేపదే ప్రకటిస్తుంటారు. ఆ విధంగానే తాము నడుచుకుంటామని, నడుస్తున్నామని చెపుతారు. ఇంతకీ మహమ్మద్ జీవితం ఏమిటి? ఆయన చెప్పిన, చేసిన పనులు ఏమిటి? అన్న విషయాలను వివరించే అనేక అరబిక్ గ్రంధాలు ఉన్నాయి. అలాగే అనేకమంది యూరోపియన్లు పరిశోధన చేసి ప్రవక్త జీవితచరిత్రను వ్రాశారు. అరబిక్ పండితుడు, పరిశోధకుడు డా. మార్గోలియత్ వ్రాసిన ‘Mohammad & The Rise of Islam’ అనే 600పేజీల బృహత్ గ్రంథపు సంక్షిప్త అనువాదమే ‘ఆఖరు ప్రవక్త – అతని మతం’. ఇస్లాం పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలనుకునేవారికి ఉపయుక్తమైనది.
|
List Layout
Filters Sort results
Reset Apply

For Bulk Bookings contact +91 85209 99562







