Description
1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆ స్వాతంత్ర్యం కూడా దేశం మూడు ముక్కలు అయిన తరువాత లభించినా, మనకంటూ ఒక భాగం మిగిలింది. మన ఇష్టానుసారం, మనదైన మార్గంలో, మన జ్ఞానపరంపరకు అనుగుణంగా దేశాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం వచ్చింది. ఈ పని మనం గతంలో చేసి చూపించాం కూడా. అదే దారిలో ప్రయాణించి కాలానుగుణంగా దేశ గమనాన్ని మలుచుకోగలిగి ఉండేవాళ్ళం. అందుకు తగిన పరిస్థితులు ఉన్నాయి కూడా. వందలాది ఏళ్ళ తరువాత స్వాతంత్య్రం లభించింది. ప్రజలు కూడా పాలకుల, నాయకుల మాటల్ని పూర్తిగా నమ్మి వారు ఏం చెపితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
అయితే రాజ్యాంగపు పీఠికలో వ్రాసుకున్నట్లుగా మనం ‘ఇండియా’ గానే మిగిలిపోయాం. దీనికి ప్రధాన కారణం మనల్ని మనం మరచిపోవడమే. ‘స్వ’ ను మరచిపోవడంవల్ల మనం వెనుకబడిపోయాం. సముద్రాన్ని లంఘించగలిగిన శక్తిసామర్ధ్యాలు మనలో ఉన్నా వాటిని మరచిపోయాం. జనసామాన్యంలో వచ్చిన సాంస్కృతిక, సామాజిక జాగృతి 2014 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిఫలించింది.
ISBN: 978-81-998827-9-9 ; Samvit Prakashan ; Paperback ; 160 pages

For Bulk Bookings contact +91 85209 99562
Reviews
There are no reviews yet.